‘తెలంగాణలో KCR కుటుంబం వేల కోట్లు దోచుకుంది’

by Disha Web Desk 2 |
‘తెలంగాణలో KCR కుటుంబం వేల కోట్లు దోచుకుంది’
X

దిశ, వెబ్‌డెస్క్: కేసీఆర్ కుటుంబంపై కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. శనివారం కిషన్ రెడ్డి ఖైరతాబాద్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశం కోసం.. పిల్లల భవిష్యత్తు కోసం ఓటు వేయాలని సూచించారు. నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక దేశంలో ఉగ్రదాడులు లేవు.. మత ఘర్షణలు లేవు అన్నారు. కేసీఆర్ కుటుంబం మాత్రం పదేళ్లలో రాష్ట్రాన్ని లూటీ చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో వేల కోట్లు దోచుకున్నారని అన్నారు. ఇక్కడ చాలదన్నట్లు కూతురు ఢిల్లీకి వెళ్లి మరీ దోపిడీకి పాల్పడిందని విమర్శించారు. తప్పు చేసింది కాబట్టే ఇప్పుడు తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తుందని అన్నారు. కాంగ్రెస్ అంటేనే వెన్నుపోటు పార్టీ అని తెలిపారు. దేశంలో స్థిరమైన పాలన కోసం బీజేపీని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కర్ఫ్యూలు, మతకలహాలే ఉంటాయని అన్నారు. దేశంలో కాంగ్రెస్ చేయని కుంభకోణం లేదని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.






Next Story

Most Viewed