BRS గెలిచే మొదటి పార్లమెంట్ సీటు చేవెళ్లదే: కాసాని జ్ఞానేశ్వర్

by Disha Web Desk 2 |
BRS గెలిచే మొదటి పార్లమెంట్ సీటు చేవెళ్లదే: కాసాని జ్ఞానేశ్వర్
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికలపై కాసాని జ్ఞానేశ్వర్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం చేవెళ్లలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. చేవెళ్ల నియోజకవర్గంలో కచ్చితంగా గెలుస్తున్నాం అని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాల్లో మొదట గెలిచే స్థానం కచ్చితంగా చేవెళ్లదే అని అన్నారు. కొన్ని దశాబ్దాలుగా సమాజంలోని సబండ వర్గాల కోసం నా చేతనైనంత మేరకు సేవ చేశానని అన్నారు. వారంతా ఇప్పటికే తనకు మద్దతు ఇస్తామని తెలియజేస్తున్నారని వెల్లడించారు. ఎన్నికల్లో తనను ఆశీర్వదించి నియోజకవర్గ ప్రజలకు సేవచేసే అవకాశం కల్పించాలని ఓటర్లకు కాసానికి జ్ఞానేశ్వర్ విజ్ఞప్తి చేశారు.


Next Story

Most Viewed