రేవంత్ రెడ్డి ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడు.. ఈటల రాజేందర్ వార్నింగ్

by Disha Web Desk 2 |
రేవంత్ రెడ్డి ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడు.. ఈటల రాజేందర్ వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ కీలక నేత, మల్కా‌‌జ్‌గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఈటల మీడియాతో మాట్లాడుతూ.. నడుమంత్రపు సిరిలాగా.. అనూహ్యంగా ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి రెండు నాల్కల ధోరణి అవలంభిస్తున్నారని విమర్శించారు. ఇటీవలే ప్రధాని మోడీని పెద్దన్న అని.. ఆయన ఆశీర్వాదం ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి.. ఇప్పుడేమో విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే అని అన్నారు. మొదట కేసీఆర్‌ కూడా ఇలాగే వ్యవహరించాడని గుర్తుచేశారు.

రేవంత్ రెడ్డి ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలని.. అధికారం ఉందని ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఫోన్ టాపింగ్ చేస్తున్నారు విమర్శలు చేసి.. ఇప్పుడు మీరు కూడా టాపింగ్‌కు పాల్పడుతున్నట్లు తెలుస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు రేవంత్ రెడ్డి వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు. ‘రాహుల్ గాంధీకి ఫండ్స్ పంపించడానికి ఇక్కడ ఉన్న వ్యాపారస్తుల ఎంత వేధిస్తున్నది, ఎంత బ్లాక్ మెయిల్ చేస్తున్నది రికార్డ్ అవుతుంది. ఒక్క రాష్ట్రంలో ఉండి నేనే అన్నీ అనుకుంటున్నావు. నిన్ను వీక్షించే వారు కూడా ఉన్నారు అని మర్చిపోకు’ అని హితవు పలికారు. మల్కాజ్‌గిరిలో బీజేపీ జెండా ఎగిరేసి తీరుతా అని ధీమా వ్యక్తం చేశారు.


Next Story

Most Viewed