‘కాంగ్రెస్ హయాంలో ఈసీ నిష్పక్షపాతంగా పనిచేసింది’

by Disha Web Desk 2 |
‘కాంగ్రెస్ హయాంలో ఈసీ నిష్పక్షపాతంగా పనిచేసింది’
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేస్తామని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. శుక్రవారం మెదక్ జిల్లాలోని నర్సాపూర్‌లో జగ్గారెడ్డి రోడ్ షో నిర్వహించారు. మెదక్‌లో నీలం మధును గెలిపించాలని కోరారు. మరోవైపు బీజేపీ నేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్‌లో ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా ఎన్నికల కమిషన్ నోటీసులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో ఎన్నికల సంఘం కూడా నిష్పక్షపాతంగా పనిచేసిందని గుర్తుచేశారు. ప్రస్తుత ఎన్నికల సంఘం బీజేపీకి తొత్తులా పనిచేస్తోందని విమర్శించారు. ప్రజాస్వామ్య దేశంలో ఇది మంచి పద్దతి కాదని అన్నారు. ఓటమి భయంతోనే ప్రభుత్వ సంస్థలను బీజేపీ నిర్వీర్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed