మనుగడలో లేని పార్టీకి 56 కోట్లు విరాళం.. ఎలా ఇచ్చారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

by Disha Web Desk 3 |
మనుగడలో లేని పార్టీకి 56 కోట్లు విరాళం.. ఎలా ఇచ్చారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
X

దిశ వెబ్ డెస్క్: అటు సార్వత్రిక ఎన్నికలు, ఇటు అసంబ్లీ ఎన్నికలతో దేశ వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. ఎటు చూసిన పార్టీ్ల ప్రచారాలతో దేశ రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి. అయితే ఈ ఎన్నికలను కొంతమంది తమ స్వార్థానికి వాడుకుంటున్నారు. అసలు గుర్తింపే లేని పార్టీలకు విరాళాలు ఇచ్చి కట్టాల్సిన పన్నుని ఎగ్గొడుతున్నారు.

ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది. వరాల్లోకి వెళ్తే.. సర్దార్ వల్లభాయ్ పటేల్ అనే పార్టీకి 56 కోట్ల విరాళం అందింది. అసలు గుర్తింపు లేని ఈ పార్టీ నుండి ముగ్గురు అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఇక ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు సమర్పించే అఫీడివిట్‌లో తమకు సొంత ఇల్లు, వాహనాలు లేవని పేర్కొన్నారు. కాగా 2022లో తమ పార్టీకి రూ.56 కోట్లు ఫండ్స్ వచ్చాయని ఆ పార్టీ ఈసీకి తెలిపింది.

ప్రస్తుతం ఈ పార్టీ జిరాక్స్ సెంటర్ నుంచి నడుస్తున్నట్లు సమాచారం. ఇలా గుర్తింపు లేని పార్టీలకు హవాలా వ్యక్తుల ద్వారా కొందరు ఎలక్ట్రోరల్ బాండ్స్ రూపంలో డబ్బులు చెల్లించినట్లు చూపించి ప్రభుత్వానికి కట్టాల్సిన పన్ను కట్టకుండా ఎగ్గొడుతున్నారు.

Next Story

Most Viewed