ఐపీఎల్ నుంచి మ్యాక్స్‌వెల్ ఔట్.. అతని స్థానంలో పంజాబ్ ఎవరిని తీసుకుందో తెలుసా?

by Harish |

పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండర్, ఆస్ట్రేలియాకు చెందిన మ్యాక్స్‌వెల్ ఐపీఎల్ మధ్యలోనే వైదొలిగిన విషయం తెలిసిందే.

ఐపీఎల్ నుంచి మ్యాక్స్‌వెల్ ఔట్.. అతని స్థానంలో పంజాబ్ ఎవరిని తీసుకుందో తెలుసా?
X

దిశ, స్పోర్ట్స్ : పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండర్, ఆస్ట్రేలియాకు చెందిన మ్యాక్స్‌వెల్ ఐపీఎల్ మధ్యలోనే వైదొలిగిన విషయం తెలిసిందే. వేలికి గాయం కావడంతో మిగతా సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. తాజాగా మ్యాక్స్‌వెల్ స్థానాన్ని భర్తీ చేసింది. ఆస్ట్రేలియాకే చెందిన ఆల్‌రౌండర్ మిచెల్ ఓవెన్‌ను జట్టులోకి తీసుకున్నట్టు ఫ్రాంచైజీ శనివారం వెల్లడించింది. అతనితో పంజాబ్ రూ. 3 కోట్లతో ఒప్పందం చేసుకుంది. మంచి హిట్టర్, పేస్ ఎటాక్ కలిగిన ఓవెన్ చేరిక పంజాబ్‌ బలాన్ని పెంచేదే. ఈ ఏడాది బిగ్‌బాష్ లీగ్‌లో రెచ్చిపోయిన అతను 203.60 స్ట్రైక్‌రేటుతో 452 రన్స్ చేశాడు. మొత్తంగా 34 టీ20ల్లో 646 పరుగులు చేయడంతోపాటు 10 వికెట్లు తీశాడు. మరోవైపు, ఈ సీజన్‌లో మ్యాక్స్‌వెల్ దారుణంగా తేలిపోయాడు. 7 మ్యాచ్‌ల్లో 48 రన్సే చేశాడు.


Next Story