IPL 2025: మరోసారి రెచ్చిపోయిన ముంబై బ్యాటర్లు.. లక్నో ఎదుట భారీ టార్గెట్

by Gantepaka Srikanth |

ముంబైలోని వాంఖడే మైదానం(Wankhede Stadium) వేదికగా లక్నో(Lucknow Super Giants)తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై(Mumbai Indians) బ్యాటర్లు అదరగొట్టారు.

IPL 2025: మరోసారి రెచ్చిపోయిన ముంబై బ్యాటర్లు.. లక్నో ఎదుట భారీ టార్గెట్
X

దిశ, వెబ్‌డెస్క్: ముంబైలోని వాంఖడే మైదానం(Wankhede Stadium) వేదికగా లక్నో(Lucknow Super Giants)తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై(Mumbai Indians) బ్యాటర్లు అదరగొట్టారు. సొంత గ్రౌండ్‌లో మరోసారి రెచ్చిపోయారు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ విఫలం అయినా భారీ స్కోరు సాధించారు. టాస్ ఓడి ముందుగా ముంబై బ్యాటింగ్ చేసింది. రికెల్టన్ (58), రోహిత్ శర్మ (12), విల్ జాక్స్ (29), సూర్యకుమార్ యాదవ్ (54), నమన్ ధీర్ (25) పరుగులు చేయడంతో ముంబైకి భారీ స్కోరు సాధ్యమైంది. మొత్తంగా 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేశారు. లక్నో విజయం సాధించాలంటే 216 పరుగులు చేయాల్సి ఉంది. లక్నో బౌలర్లలో మయాంక్ యాదవ్ రెండు వికెట్లు తీయగా, ప్రిన్స్, దిగ్వేష్, బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్ తలో వికెట్ తీశారు.

Next Story