ఐపీఎల్ వాయిదా.. క్రికెటర్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు

by Harish |
ఐపీఎల్ వాయిదా.. క్రికెటర్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-2025 వాయిదా పడిన నేపథ్యంలో క్రికెటర్లు, సపోర్టింగ్‌ స్టాఫ్‌కు బీసీసీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. విదేశీ క్రికెటర్లు తమ స్వదేశానికి తిరిగి వెళ్లాలని, భారత ఆటగాళ్లు తమ ఇండ్లకు వెళ్లాలని తెలిపింది. ప్రస్తుతానికి లీగ్‌ను వారంపాటు నిలిపివేసినా..తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతుందో కచ్చితంగా తెలియదు. మరోవైపు, భారత్, పాక్ మధ్య యుద్ధం నేపథ్యంలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్ క్రికెట్ బోర్డులు తమ క్రికెటర్ల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ ఆటగాళ్లకు ఆదేశాలు జారీ చేసింది. ‘ప్రతి విదేశీ ప్లేయర్, సపోర్టింగ్ స్టాఫ్ మెంబర్ వారి దేశానికి తిరిగి వెళ్తారు. వారికి అన్ని రకాలుగా సహాయం చేస్తాం. టోర్నీపై భవిష్యత్తులో తీసుకునే నిర్ణయంపై వారు తిరిగి రావడం ఆధారపడి ఉంటుంది.’ అని బోర్డు వర్గాలు తెలిపాయి.




Next Story

Most Viewed