ఐపీఎల్‌లో సత్తా చాటిన తెలుగోడు

by Disha Web Desk 12 |
ఐపీఎల్‌లో సత్తా చాటిన తెలుగోడు
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023లో భాగంగా ముంబై, బెంగళూరు మధ్య చిన్నస్వామి స్టేడియం వేదికగా 5వ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు టాపార్డర్ మొత్తం ఆర్సీబీ బౌలర్ల దాటికి కుప్పకూలిపోయారు. అయినా కూడా తిలక్ వర్మ మాత్రం తన స్టైల్‌లో భారీ షాట్స్ ఆడుతూ.. అందొచ్చిన బాల్‌ను బౌండరీలకు తరలించాడు. ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ ఒక్కడే.. 46 బంతులకు 4 సిక్సర్లు 9 ఫోర్లతో 84 పరుగులు చేసి తెలుగోడి సత్తా ఏంటో నిరూపించాడు. కాగా ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. కానీ ముంబై బౌలర్లు రాణించకపోవడం.. కోహ్లీ, డుప్లెసిస్ భీకర ఫామ్ కొనసాగించడంతో ముంబై జట్టు ఓటమి చెందింది.

Next Story

Most Viewed