సెంచరీతో చెలరేగిన చెన్నై కెప్టెన్ గైక్వాడ్.. లక్నో ఎదుట భారీ లక్ష్యం

by Disha Web Desk 2 |
సెంచరీతో చెలరేగిన చెన్నై కెప్టెన్ గైక్వాడ్.. లక్నో ఎదుట భారీ లక్ష్యం
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌లో మరో సెంచరీ నమోదైంది. చెన్నైలోని చిదంబరం మైదానం వేదికగా జరుగుతోన్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సెంచరీతో చెలరేగాడు. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన చెన్నై జట్టు భారీ స్కోరు చేసింది. కెప్టెన్ రుతురాజ్(108), శివమ్ దూబె(66) రాణించారు. దీంతో మొత్తంగా 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి చెన్నై 210 పరగులు చేసింది. లక్నో బౌలర్లలో హెన్రీ, మోసిన్ ఖాన్, యశ్ ఠాకూర్ తలో వికెట్ తీశారు. శివమ్ దూబెను మార్కస్ స్టోయినీస్ రన్‌అవుట్ చేశారు. లక్నో విజయం సాధించాలంటే 211 పరుగులు చేయాల్సి ఉంది.



Next Story

Most Viewed