IPL 2024: అరుదైన రికార్డు సృష్టించిన రిషబ్ పంత్

by Disha Web Desk 2 |
IPL 2024: అరుదైన రికార్డు సృష్టించిన రిషబ్ పంత్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌లో ఢిల్లీ వారియర్స్ కెప్టెన్ రిషబ్ పంత్ అరుదైన రికార్డు సృష్టించారు. ఐపీఎల్‌లో అతి తక్కువ బంతుల్లో(2028) మూడు వేల పరుగులు చేసిన బ్యాటర్‌ రికార్డు క్రియేట్ చేశారు. రిషబ్ తర్వాతి స్థానంలో యూసుఫ్ పఠాన్(2062), సూర్యకుమార్ యాదవ్(2130), సురేశ్ రైనా(2135) ఉన్నారు. అంతేగాకుండా అతి పిన్న వయస్సులో మూడు వేల రన్స్ చేసిన ప్లేయర్ల జాబితాలో పంత్ మూడో స్థానంలో నిలిచారు. అతనికంటే ముందు గిల్, విరాట్ కోహ్లీ ఉన్నారు. శుక్రవారం లక్నోతో జరిగిన మ్యాచ్‌లో పంత్ ఈ ఘనత సాధించారు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. కాగా, ఈ ఐపీఎల్‌లో ఢిల్లీకి ఇదే తొలి గెలుపు కావడం విశేషం. మూడు వరుస విజయాల తర్వాత ఢిల్లీ చేతిలో లక్నో ఓటమి పాలైంది.

Next Story