ఆ విషయంలో ఇప్పటి వరకు ఆర్సీబీయే టాప్

by Dishafeatures2 |
ఆ విషయంలో ఇప్పటి వరకు ఆర్సీబీయే టాప్
X

దిశ, వెబ్ డెస్క్: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కి ఇంతవరకు ఒక్క ఐపీఎల్ టైటిల్ కూడా దక్కలేదు. కానీ ఫ్యాన్ బేస్ లో గత 16 ఏళ్లుగా ఆర్సీబీకి ఎలాంటి ఢోకా లేదు. సీఎస్కే, ముంబై ఇండియన్స్ వంటి స్టార్ జట్లకు ఏమాత్రం తీసిపోని ఫ్యాన్ ఫాలోయింగ్ ఆర్సీబీ సొంతం. కాగా ఈ సీజన్ లో ప్లే ఆఫ్ వరకు వచ్చిన ఆర్సీబీ.. గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది. కానీ ఈ సీజన్ లో ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ ఓ కొత్త రికార్డును క్రియేట్ చేసింది. 100 పరుగులకు పైగా తేడాతో అత్యధిక సార్లు ప్రత్యర్థులను చిత్తు చేసిన జట్టుగా ఆర్సీబీ రికార్డు సృష్టించింది.

100 ప్లస్ రన్స్ తేడాతో ఆర్సీబీ మొత్తం నాలుగుసార్లు ప్రత్యర్థులను మట్టికరిపించింది. రాజస్థాన్ రాయల్స్ తో 112 రన్స్ (2023), గుజరాత్ లయన్స్ పై 114 (2016), పంజాబ్ పై 138 (2015), 2013లో పుణె వారియర్స్ ఇండియాపై 130 పరుగుల తేడాతో గెలిచి నయా రికార్డును క్రియేట్ చేసింది. ఇక వచ్చే సీజన్ లో మంచి పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటామని ఆర్సీబీ మేనేజ్ మెంట్ ప్రకటించింది.



Next Story

Most Viewed