127 పరుగులను కాపాడుకున్న RCB

by Disha Web Desk 12 |
127 పరుగులను కాపాడుకున్న RCB
X

దిశ, వెబ్‌డెస్క్: సోమవారం లక్నో వేదికగా 43వ ఐపీఎల్ మ్యాచ్ లక్నో, బెంగళూరు మధ్య లక్నో వేదికగా జరిగింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ సేన 127 పరుగుల స్వల్ప స్కోరును కాపాడుకుని 18 పరుగుల తేడాతో విజయం సాధించి లక్నో పై పగ తీర్చుకుంది. ఈ మ్యాచ్ మొదట్లో.. టాస్ గెలిచిన బెంగళూరు జట్టు బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో కెప్టెన్ డుప్లెసిస్ 44, కోహ్లీ 31, తప్ప ఎవరు రాణించకపోవడంతో 9 వికెట్ల నష్టానికి కేవలం 126 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం 127 పరుగుల స్వల్ప లక్ష్యంతో చేజింగ్ కు దిగిన లక్నో జట్టుకు మొదటి ఓవర్ నుంచి షాక్ తగిలింది. దీంతో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 19.5కు 108 పరుగులకు ఆలౌట్ అయి ఓటమి చెందింది.

Next Story

Most Viewed