మొన్న SRH ఓడిపోవాలని మొక్కిన వారే.. నేడు గెలవాలని మొక్కుతున్నారు

by Disha Web Desk 12 |
మొన్న SRH ఓడిపోవాలని మొక్కిన వారే.. నేడు గెలవాలని మొక్కుతున్నారు
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023లో ఎన్నడు లేని విధంగా.. ప్లే ఆఫ్ రేసు కొనసాగుతుంది. చరిత్రలో లీగ్ చివరి మ్యాచ్ వరకు ప్లే ఆఫ్ పోటీ కొనసాగడం ఇదే మొదటి సారి అని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఈ సీజన్ లో ఇప్పటికే గుజరాత్, చెన్నై, లక్నో జట్లు ప్లే ఆఫ్‌కు ఆర్హత సాధింగా.. నాలుగో ప్లేస్ కోసం.. బెంగళూరు, ముంబై, రాజస్థాన్ పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో ఈ రోజు మధ్యాహ్నం ముంబై, హైదరాబాద్ మధ్య 69వ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో ఈ మ్యాచ్‌శలో ముంబై గెలిస్తే.. గుజరాత్, బెంగళూరు మ్యాచ్ ఫలితాలపై ఆధారపడవలసి వస్తుంది. కానీ ముంబై హైదరాబాద్ చేతిలో ఓడిపోతే.. మాత్రం బెంగళూరు జట్టు ప్లే ఆఫ్ చేరుకుంటుంది.

ఒక వేళ గుజరాత్‌తో జరిగే మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోయిన లేదా.. 6 పరుగుల కంటే తక్కువ తేడాతో ఓడిపోయినా కూడా బెంగళూరు జట్టు ప్లే ఆఫ్ చేరుకుంటుంది. దీంతో ముంబై పై హైదరాబాద్ ఎలాగైనా విజయం సాధించాలని ఆర్సీబీ అభిమానులు మొక్కుకుంటున్నారు. మొన్నటి మ్యాచ్‌లో బెంగళూరుపై SRH ఓడిపోవాలని మొక్కిన వారే.. ఇప్పుడు.. గెలవాలని కోరుకుంటున్నారని సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తున్నారు. మరీ ఇంత క్రేజ్ ఉన్న ఈ మ్యాచ్‌లో ఎవరు విజయం సాధిస్తారో తెలియాలి అంటే సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే.



Next Story

Most Viewed