ఓటమి అంచుల్లో గెలుపు సాధించిన పంజాబ్ జట్టు..

by Disha Web Desk 12 |
ఓటమి అంచుల్లో గెలుపు సాధించిన పంజాబ్ జట్టు..
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023లో భాగంగా పంజాబ్, లక్నో మధ్య జరిగిన 18వ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు విజయం సాధించింది. లక్నో వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో లక్నో మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. అనంతరం 160 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన పంజాబ్‌కు ఆదిలోనే గట్టి దెబ్బ తగిలింది. మధ్యలో సికిందర్ రజా.. షార్ట్, షారుక్ ఖాన్‌లు రాణించడంతో 19.3 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. దీంతో చివరి ఓవర్ వరకు మ్యాచ్ రావడంతో అంతా పంజాబ్ ఓటమి కాయంగా కనిపించింది. కానీ షారుఖ్ రాణించడంతో పంజాబ్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Next Story

Most Viewed