మొదటి వికెట్ కోల్పోయిన ముంబై

by Dishafeatures2 |
మొదటి వికెట్ కోల్పోయిన ముంబై
X

దిశ, వెబ్ డెస్క్: సొంత గ్రౌండ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై మొదటి వికెట్ కోల్పోయింది. 201 పరుగుల లక్ష్యతో బరిలోకి దిగిన ముంబై జట్టు బ్యాటర్ ఇషాన్ కిషన్ 14 రన్స్ చేసి బ్రూక్ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ టీమ్ 20 ఓవర్లలో 200 రన్స్ చేసింది. ఓపెనర్లుగా వచ్చిన వివ్రాంత్ శర్మ, మయాంక్ అగర్వాల్ చివరి మ్యాచ్ లో సత్తా చాటారు. వివ్రాంత్ శర్మ... కొట్టగా.. మయాంక్ శర్మ సెంచరీతో ఆకట్టుకున్నాడు.

ఇక సన్ రైజర్స్ దెబ్బకు ముంబై బౌలర్స్ చేతులెత్తేశారు. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికే ప్లే ఆఫ్ కు దూరం కాగా.. ఈ మ్యాచ్ లో గెలిచి ప్లే ఆఫ్ కు పోవాలని ముంబై పట్టుదలతో ఉంది. ఇక ఇప్పటికే గుజరాత్ టైటాన్స్, చెన్నయ్ సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ప్లే ఆఫ్ కు చేరుకున్నాయి. ఇక నాలుగో ప్లేస్ కోసం ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ పోటీ పడుతున్నాయి. కాగా ఆర్సీబీ ఇవాల సాయంత్రం చెన్నయ్ లోని చెపాక్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ తో తలపడనుంది.


Next Story