ఐపీఎల్‌లో అరుదైన రికార్డు సృష్టించిన బుమ్రా

by Dishanational3 |
ఐపీఎల్‌లో అరుదైన రికార్డు సృష్టించిన బుమ్రా
X

దిశ, స్పోర్ట్స్ : ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా ఐపీఎల్‌లో అరుదైన రికార్డు సృష్టించాడు. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసిన అతను ఐపీఎల్‌లో 150 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. దీంతో ఐపీఎల్‌లో ఒకే ఫ్రాంచైజీ తరపున 150 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా రికార్డుకెక్కాడు. మొత్తంగా ఐపీఎల్‌లో ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా నిలిచాడు. బుమ్రా కంటే ముందు లసిత్ మలింగ(ముంబై ఇండియన్స్, 170 వికెట్లు), సునీల్ నరైన్(కోల్‌కతా నైట్ రైడర్స్, 166 వికెట్లు) ఈ మైలురాయిని అందుకున్నారు. 2013లో ముంబై తరపున అరంగేట్రం చేసిన బుమ్రా 124 మ్యాచ్‌ల్లో 150 వికెట్లు పడగొట్టాడు.



Next Story

Most Viewed