IPL 2023: కోహ్లీ కాళ్లు మొక్కిన రింకూ సింగ్.. ఫోటోలు వైరల్‌!

by Disha Web Desk 13 |
IPL 2023: కోహ్లీ కాళ్లు మొక్కిన రింకూ సింగ్.. ఫోటోలు వైరల్‌!
X

దిశ, వెబ్‌డెస్క్: కోల్‌కతా నైట్‌రైడర్స్ బిగ్ హిట్టర్ రింకూ సింగ్ కోహ్లీపై తనకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. విరాట్ కోహ్లీ కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా ఆర్‌సీబీ-కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ ముగిసిన తర్వాత డగౌట్‌కు వెళ్లే క్రమంలో రింకూ సింగ్.. విరాట్ కోహ్లీ పాదాలను టచ్ చేసి ఆశీర్వాదం తీసకున్నాడు. వెంటనే కోహ్లీ అతన్ని లేపి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీపై 21 పరుగుల తేడాతో కేకేఆర్ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 200 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 179 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది.

Next Story

Most Viewed