IPL 2023: జియో సినిమాకు బ్రాండ్ అంబాసిడర్‌గా రోహిత్ శర్మ

by Disha Web Desk 13 |
IPL 2023: జియో సినిమాకు బ్రాండ్ అంబాసిడర్‌గా రోహిత్ శర్మ
X

దిశ, వెబ్‌డెస్క్: JioCinema.. IPL 2023 సీజన్‌కు తన బ్రాండ్ అంబాసిడర్‌గా ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మను నియమించుకుంది. JioCinema త్వరలో రోహిత్ శర్మ నటించిన ప్రోమోలు, ప్రకటన ప్రచారాలతో బయటకు రానుంది. జియో సినిమా, ముంబై ఇండియన్స్ రెండూ రిలయన్స్ గ్రూప్ యాజమాన్యంలో ఉన్నాయి. ఇప్పటివరకు సచిన్ టెండుల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, సూర్యకుమార్ యాదవ్- రిలయన్స్ జియో బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తోన్నారు.

అదే జాబితాలో తాజాగా రోహిత్ శర్మ కూడా చేరాడు. ఇప్పటికే రోహిత్ శర్మపై కొన్ని ఫొటో షూట్స్, ప్రోమోలను చిత్రీకరించింది జియో సినిమా యాజమాన్యం. వాటిని త్వరలోనే ప్రసారం చేయనుంది. ప్రస్తుతం ఐపీఎల్ 2023 మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా టెలికాస్ట్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ విషయంలో ఈ రెండు ప్లాట్‌ఫామ్స్ పోటీపడుతున్నాయి. అదే స్థాయిలో వ్యూవర్‌షిప్‌ను సొంతం చేసుకుంటోన్నాయి.

Next Story