IPL 2023: ప్లేఆఫ్స్ చేరే జట్లు ఇవే.. టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ జోస్యం!

by Disha Web Desk 13 |
IPL 2023: ప్లేఆఫ్స్ చేరే జట్లు ఇవే.. టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ జోస్యం!
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023 సీజన్‌ సెకెండ్ హాఫ్.. రసవత్తరంగా సాగుతోంది. ఇక ప్లేఆఫ్స్ సమీపిస్తోన్న కొద్దీ మ్యాచ్‌లు ఆసక్తికరంగా మారుతున్నది. జట్ల మధ్య పోటీ తీవ్రతరమౌతోంది. ప్లేఆఫ్స్ రేసులో తామూ ఉండాలనే పట్టుదలతో ఉన్నాయి. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్న జట్లు.. టాప్ పొజీషన్‌ వైపు దూసుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ప్లే ఆఫ్ చేరే జట్లపై జోస్యం చెప్పారు. హర్భజన్ ప్లేఆఫ్స్ ఆడబోయే నాలుగు జట్ల పేర్లను వెల్లడించారు.

చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్.. ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్ చేరుకుంటాయని అంచనా వేశారు. తన అంచనాలు తప్పే అవకాశం లేదని వ్యాఖ్యానించారు. అయితే మిగిలిన జట్లు లక్నో, రాజస్తాన్, పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్‌లో అడుగు పెట్టే అవకాశాలు ఉన్నప్పటికీ తీవ్రంగా పోరాడాలని హర్భజన్ పేర్కొన్నాడు. అయితే ఈ సీజన్‌లో ఏ జట్టు ఛాంపియన్‌గా నిలుస్తుందనేది ఇప్పుడే అంచనాకు రాలేమని తెలిపాడు.

Next Story

Most Viewed