IPL 2023: సెంచరీతో చెలరేగిన గిల్‌.. సన్‌రైజర్స్ టార్గెట్ ఇదే

by Disha Web Desk 13 |
IPL 2023: సెంచరీతో చెలరేగిన గిల్‌.. సన్‌రైజర్స్ టార్గెట్ ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో శుబ్‌మన్‌ గిల్‌(58 బంతుల్లో 101) సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు సాయి సుదర్శన్‌(47) పరుగులతో రాణించాడు. కాగా ఓ దశలో గుజరాత్‌ స్కోర్‌ బోర్డు 200 పరుగులు ఈజీగా దాటుతుందని అంతా భావించారు.

కానీ డెత్‌ ఓవర్లలో సన్‌రైజర్స్ బౌలర్లు అద్భుతమైన కమ్‌ బ్యాక్‌ ఇచ్చారు. ముఖ్యంగా భువనేశ్వర్‌ కుమార్‌ మరోసారి తన అనుభవాన్ని కనబరిచాడు. ఆఖరి ఓవర్‌ వేసిన భువీ కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 5 వికెట్లు సాధించాడు. జాన్‌సెన్, ఫరూకీ, నటరాజన్ చెరో వికెట్ తీశారు.

Next Story

Most Viewed