IPL 2023: రాణించిన డుప్లెసిస్‌, మ్యాక్స్‌వెల్.. రాజస్తాన్ టార్గెట్ ఇదే

by Disha Web Desk 13 |
IPL 2023: రాణించిన డుప్లెసిస్‌, మ్యాక్స్‌వెల్.. రాజస్తాన్ టార్గెట్ ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్‌లో 5 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్స్‌లో.. ఓపెనర్‌ విరాట్‌ కోహ్లి (18) మరోసారి విఫలం కాగా.. కెప్టెన్‌ డుప్లెసిస్‌(55), వన్‌డౌన్‌ బ్యాటర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌(54) హఫ్ సెంచరీలతో రాణించారు. ఆఖర్లో అనూజ్‌ రావత్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. 11 బంతుల్లో 3 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 29 పరుగులతో అజేయంగా నిలిచాడు. రాజస్తాన్ బౌలర్‌లో.. అడమ్ జంపా 2, ఆసిఫ్ 2, సందీప్ శర్మ 1 వికెట్ తీశారు.



Next Story

Most Viewed