IPL 2023: ఢిల్లీ కెప్టెన్ అరుదైన రికార్డు..

by Disha Web Desk 13 |
IPL 2023: ఢిల్లీ కెప్టెన్ అరుదైన రికార్డు..
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా సొంతగడ్డపై ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వార్నర్ సేన ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్‌లో ముగ్గురు బ్యాటర్లు మాత్రమే రాణించారు. కెప్టెన్ డేవిడ్ వార్నర్(51), అక్షర్ పటేల్(54), మనీష్ పాండే(26) పరుగులు చేశారు. పృథ్వీ షా(15) సహా మిగిలిన బ్యాటర్లందరూ చేతులెత్తేశారు. డేవిడ్ వార్నర్ ఓ అరుదైన రికార్డును అందుకున్నాడు. 600 ఫోర్లు బాదాడు. ఐపీఎల్‌లో ఇదో రికార్డు. ముంబై ఇండియన్స్‌పై మ్యాచ్‌లో 47 బంతుల్లో 6 ఫోర్లతో 51 పరుగులు చేశాడు వార్నర్. ఈ ఆరు ఫోర్లతో అతను 600 బౌండరీల మార్క్‌ను దాటేశాడు.

ఐపీఎల్‌ 2023 సీజన్‌లో ఢిల్లీ కేపిటల్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. దీనికి ఎక్కడే గానీ బ్రేకులు పడట్లేదు. నాలుగు మ్యాచ్‌లు ఆడినప్పటికీ ఇంకా బోణీ కొట్టనే లేదు. ఇప్పటివరకు ఆడిన నాలుగింట్లోనూ అపజయాలను చవి చూసింది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచిందీ జట్టు. శనివారం తన తదుపరి మ్యాచ్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఢీ కొట్టాల్సి ఉంది.

Next Story