కోల్ కతా, ముంబై కెప్టెన్లకు భారీ జరిమాన

by Disha Web Desk 1 |
కోల్ కతా, ముంబై కెప్టెన్లకు భారీ జరిమాన
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2023 లో భాగంగా నిన్న ముంబై, కోల్ కతాకు మధ్య జరిగిన మ్యాచ్ లో ముంబై ఘన విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్ లో ఇరు జట్ల కెప్టెన్లకు మ్యాచ్ రిఫరీ జరిమానా విధించారు. కోల్ కతా ఇన్నింగ్స్ సమయంలో స్లో ఓవర్ రేట్ కారణంగా ముంబై కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కు రూ.12 లక్షలు జరిమానా విధించారు. అలాగే, నితీశ్ రాణా ఔటైన సమయంలో బౌలర్ షోకీన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో రాణా మ్యాచ్ ఫీజులో 25శాతం కోత విధిస్తున్నట్లు మ్యాచ్ రిఫరీ ప్రకటించారు.

Next Story

Most Viewed