TATA IPL 2023: ఉత్కంఠ పోరులో లక్నోపై గుజరాత్ విజయం

by Dishafeatures2 |
TATA IPL 2023: ఉత్కంఠ పోరులో లక్నోపై గుజరాత్ విజయం
X

దిశ, వెబ్ డెస్క్: లక్నోతో జరిగిన ఉత్కంఠ పోరులో గుజరాత్ విజయం సాధించింది. చివరిదాక ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో 136 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక లక్నో జట్టు చతికిలపడింది. చివరి ఓవర్ వేసిన గుజరాత్ బౌలర్ మోహిత్ శర్మ దెబ్బకు లక్నో జట్టు పరాజయాన్ని మూటగట్టుకుంది. మోహిత్ శర్మ తన చివరి ఓవర్ లో కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కాలక వికెట్లు పడగొట్టాడు. అలాగే రనౌట్ రూపంలో మరో ఇద్దరిని పెవిలియన్ కు పంపాడు. దీంతో గుజరాత్ 7 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది.

ఇక అంతకు ముందు టాస్ గెలిచిన గుజరాత్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 20 ఓవర్లు ఆడిన జీటీ 6 వికెట్ల నష్టానికి 135 రన్స్ మాత్రమే చేసింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా 66, సాహా 47 పరుగుల బాధ్యతాయుత బ్యాటింగ్ తో గుజరాత్ కనీస గౌరవప్రద స్కోర్ చేయగలిగింది. ఇక సెకండ్ బ్యాటింగ్ కు దిగిన లక్నో జట్టులో బాధ్యతనంతా తన భుజాన వేసుకున్న కేఎల్ రాహుల్ 68 పరుగులు చేసి మోహిత్ శర్మ బౌలింగ్ లో అవుటవగా.. మేయర్స్ 24, కృనాల్ పాండ్యా 23, బదోనీ 8 పరుగులు మాత్రమే చేశారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed