2022లోనే కెప్టెన్సీ గురించి గైక్వాడ్‌తో ధోనీ చర్చించాడా?

by Dishanational3 |
2022లోనే కెప్టెన్సీ గురించి గైక్వాడ్‌తో ధోనీ చర్చించాడా?
X

దిశ, స్పో్ర్ట్స్ : ఐపీఎల్-17 ప్రారంభానికి ఒక్క రోజు ముందు ఎం.ఎస్ ధోనీ చెన్నయ్ సూపర్ కింగ్స్ కెప్టెన్సీ నుంచి తప్పుకుని.. యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్‌కు పగ్గాలు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే, 2022లోనే కెప్టెన్సీ గురించి గైక్వాడ్‌కు ధోనీ చెప్పాడంట. ఈ విషయాన్ని తాజాగా గైక్వాడ్ రివీల్ చేశాడు. కోల్‌కతాతో మ్యాచ్ అనంతరం గైక్వాడ్ మాట్లాడుతూ.. కెప్టెన్సీ గురించి 2022లో తమ మధ్య తొలిసారి చర్చ జరిగిందన్నాడు. ‘నిజాయతీగా చెప్పాలంటే లోతైన చర్చ కాదు. మేము ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ధోనీ వచ్చి విషయాలన్నీ చెప్పాడు. అది 2022లో జరిగింది. ‘వచ్చే ఏడాది కాకపోవచ్చు. కానీ నాయకత్వం వహించే అవకాశం రావొచ్చు. సిద్ధంగా ఉండు’ అని నాకు చెప్పాడు. అప్పటి నుంచి నేను సిద్ధంగా ఉన్నా.’ అని తెలిపాడు.

అలాగే, తన సారథ్యంపై స్పందిస్తూ..‘సొంత నిర్ణయాలు తీసుకుంటున్నా. వీలైనంత వరకు జట్టు సభ్యులకు స్వేచ్ఛ ఇస్తున్నా. నేను సీఎస్కేలో చేరినప్పటి నుంచి అదే జరుగుతుంది. కొత్తగా ఏం మార్పులు జరగలేదు. కెప్టెన్సీని ఎంజాయ్ చేస్తున్నా.’ అని గైక్వాడ్ చెప్పుకొచ్చాడు. కాగా, సోమవారం కోల్‌కతాపై 7 వికెట్ల తేడాతో చెన్నయ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. గైక్వాడ్ నాయకత్వంలో ఐదు మ్యాచ్‌లు ఆడిన చెన్నయ్ మూడు విజయాలు, రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉన్నది.

Next Story

Most Viewed