పంజాబ్ కింగ్స్ ఓడిపోవడంతో కన్నీరు పెట్టిన అర్ష్‌దీప్ సింగ్

by Disha Web Desk 12 |
పంజాబ్ కింగ్స్ ఓడిపోవడంతో కన్నీరు పెట్టిన అర్ష్‌దీప్ సింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023లో భాగంగా KKR vs PBKS మధ్య జరిగిన 53వ మ్యాచ్ చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగింది. కాగా ఈ మ్యాచ్ చివరి ఓవరకు 7 పరుగులు కావాల్సి ఉండగా ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ 20వ ఓవర్ వేశాడు. 19.5 బంతికి రసూల్ అవుట్ కావడంతో చివరి బంతికి 2 పరుగులు కావాల్సి ఉంది. ఈ క్రమంలో రింకు సింగ్ ఫోర్ కొట్టి.. కోల్ కత జట్టుకు విజయం సాధించారు. దీంతో అర్ష్‌దీప్ సింగ్ తన జట్టుకు విజయం అందించలేక పోవడంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. కాగా ప్రస్తుతం పంజాబ్ జట్టు పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది.

Next Story

Most Viewed