ఐపీఎల్ చరిత్రలో 2వ సారి.. 20 ఓవర్లకు 9 మంది బౌలింగ్..

by Disha Web Desk 12 |
ఐపీఎల్ చరిత్రలో 2వ సారి.. 20 ఓవర్లకు 9 మంది బౌలింగ్..
X

దిశ, వెబ్‌డెస్క్: LSG-PBKS మధ్య జరిగిన మ్యాచ్ లో ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయింది. లక్నో జట్టు ఈ మ్యాచ్ లో 257 పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలో రెండవ అత్యధిక స్కోరుగా చరిత్రకెక్కింది. అలాగే 20 ఓవర్లను మొత్తం 9 మంది బౌలర్లు వేయగా.. ఇలా జరగడం ఐపీఎల్ చరిత్రలో రెండో సారి కావడం విశేషం.. ఈ మ్యాచ్ లో లక్నో బౌలర్లు.. నవీన్-ఉల్-హక్, రవి బిష్ణోయ్ నాలుగు ఓవర్లు బౌలింగ్ చేశారు.

అలాగే యశ్ ఠాకూర్ 3.5 ఓవర్లు వేశారు. అలాగే.. మార్కస్ స్టోయినిస్, కైల్ మేయర్స్, ఆయుష్ బదోని, అవేష్ ఖాన్, అమిత్ మిశ్రా మరియు కృనాల్ పాండ్యా తో కలిపి మొత్తం 9 మంది బౌలర్లు ఈ మ్యాచ్ లో బౌలింగ్ చేశారు. కాగా..20 ఓవర్లు 9 మంది బౌలర్లు వేయడం ఐపీఎల్ చరిత్రలో రెండోసారి కాగా.. IPL 2016 మ్యాచ్‌లో GLకి వ్యతిరేకంగా RCB తొమ్మిది మంది బౌలర్లను ఉపయోగించింది.

Next Story