ఉత్కంఠ పోరులో ముంబై విజయం..

by Disha Web Desk 12 |
ఉత్కంఠ పోరులో ముంబై విజయం..
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో మరో ఉత్కంఠ బరితంగా మ్యాచ్ కొనసాగింది. ముంబై, ఢిల్లీ మధ్య అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్.. చివరి బంతి వరకు నరాలు తెగెంత ఉత్కంఠగా సాగింది. చివరి బంతికి ముంబై బ్యాటర్ టీమ్ డేవిడ్.. రెండు పరుగులు తీయడంతో MI జట్టు విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్ లో మొదట టాస్ ఓడిన ఢిల్లీ బ్యాటింగ్ చేసింది. 19.4 ఓవర్లకు 10 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది.

అనంతరం 173 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన ముంబై జట్టుకు మంచి ప్రారంభం లభించింది. అయితే చివరి ఓవర్లో ముంబై వరుస వికెట్లు కోల్పోవడం, సూర్యకుమార్ యాదవ్ మళ్లీ గోల్డెన్ డకౌట్ అవడంతో ఈ మ్యాచ్ చివరి బంతి వరకు వెళ్లి.. ఎట్టకేలకు ముంబై జట్టు తమ మొట్టమొదటి విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ మ్యాన్ ఆప్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

Next Story

Most Viewed