టీ20 వరల్డ్ కప్‌కు జట్టును ఎంపిక చేసిన ఇర్ఫాన్ పఠాన్.. వారికి చోటు

by Dishanational3 |
టీ20 వరల్డ్ కప్‌కు జట్టును ఎంపిక చేసిన ఇర్ఫాన్ పఠాన్.. వారికి చోటు
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17 ముగిసిన వెంటనే టీ20 వరల్డ్ కప్ సందడి మొదలుకానుంది. ఈ పొట్టి ప్రపంచకప్‌కు ఈ నెల చివర్లో బీసీసీఐ భారత జట్టును ఎంపిక చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా భారత మాజీ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ టీ20 ప్రపంచకప్‌లో బరిలోకి దిగే భారత జట్టును ఎంపిక చేశాడు. 15 మందితో కూడి జట్టును వెల్లడించాడు.

బ్యాటర్ల జాబితాలో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, యశస్వి జైశ్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్, రింకు సింగ్‌లను సెలెక్ట్ చేశాడు. ఆల్‌రౌండర్ కోటాలో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలకు చోటు కల్పించాడు. వికెట్ కీపర్లుగా రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, జితేశ్ శర్మలలో ఇద్దరు తన ఎంపికలుగా పేర్కొన్నాడు.

అలాగే, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్‌లను స్పిన్నర్లుగా ఎంపిక చేశాడు. ఈ జట్టులో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయని లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ మొహ్సిన్ ఖాన్‌కు పఠాన్ చోటు కల్పించాడు. పేస్ దళంలో బుమ్రా, సిరాజ్‌తోపాటు మొహ్సిన్ ఖాన్‌ను చేర్చాడు. కాగా, టీ20 వరల్డ్ కప్‌కు అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. జూన్ 1 నుంచి పొట్టి ప్రపంచకప్ మొదలు కానుంది.



Next Story

Most Viewed