చెవి కమ్మలు కొనివ్వలేదని భర్తకు నిప్పంటించిన భార్య

by Disha Web Desk 2 |
చెవి కమ్మలు కొనివ్వలేదని భర్తకు నిప్పంటించిన భార్య
X

దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. చెవి కమ్మలు కొనివ్వలేదనే కోపంతో భర్తకు భార్య నిప్పంటించింది. మంటల్లో తీవ్ర గాయాలపాలైన అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతున్నాడు. విషయం తెలిసి గ్రామానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తనకు చెవి కమ్మలు కొనివ్వాలని గతకొన్ని రోజులుగా భర్త యాకూబ్ పాషాతో భార్య సమీనా రోజూ గొడవ పడుతున్నట్లు స్థానికులు చెప్పారు. తన వద్ద అంత డబ్బు లేదని.. ఇప్పుడే నగలు కొనుగోలు చేయలేను అని నిత్యం భర్త చెప్పినా భార్య వినకపోయేదని పోలీసులతో వివరించారు. ఇదే గొడవ ఆదివారం తీవ్రతరం కావడంతో పడుకున్న భర్తకు సమీనా నిప్పు పెట్టిందని సమాచారం. ఒళ్లంగా తీవ్ర గాయాల కావడంతో అతను ఆసుపత్రి చికిత్స పొందుతున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story