డివైడర్‌కు ఢీకొట్టి బోల్తా పడిన కారు.. ఇద్దరు వైద్యులు దుర్మరణం

by Disha Web Desk 2 |
డివైడర్‌కు ఢీకొట్టి బోల్తా పడిన కారు.. ఇద్దరు వైద్యులు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులోని చెన్నై నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తూత్తుకూడి సమీపంలో అగివేగంగా ప్రయాణించిన ఓ కారు డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరి కొందరు స్థానికులకు గాయాలు అయినట్లు సమాచారం. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతుల్లో ఇద్దరు వైద్యులు ఉన్నట్లు నిర్ధారించారు. మృతులంతా తిరునల్వేలి జిల్లా వాసులుగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed