ఈజీగా సంపాదించారు.. ఈజీగా దొరికిపోయారు!

by Disha Web Desk 2 |
ఈజీగా సంపాదించారు.. ఈజీగా దొరికిపోయారు!
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: హవాలా డబ్బును తరలిస్తున్న ఇద్దరిని సెంట్రల్​జోన్​టాస్క్​ఫోర్స్​పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 10 లక్షల రూపాయల నగదు, ఒక బైక్, రెండు మొబైల్​ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్​ఫోర్స్​డీసీపీ నితికా పంత్​తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఉప్పల్‌కు చెందిన చంద్రశేఖర్​(అలియాస్​వినయ్​(34)) ఉప్పల్​ఐడీఏ ప్రాంతంలోని షెపర్​పేపర్​ప్రైవేట్​లిమిటెడ్‌లో మేనేజింగ్​పార్ట్​నర్. ఇదే సంస్థలో ప్రభాకర్​(42) ఉద్యోగిగా పని చేస్తున్నాడు. వ్యాపార లావాదేవీలు జరుపుతున్న నేపథ్యంలో చంద్రశేఖర్‌కు కొందరు హవాలా ఏజెంట్లతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో తేలికగా డబ్బు సంపాదించేందుకుగాను చంద్రశేఖర్​తన వద్ద పని చేస్తున్న ప్రభాకర్‌తో కలిసి కొంతకాలంగా హవాలా దందా నడిపిస్తున్నాడు.

గురువారం రాత్రి బేగంబజార్​ప్రాంతంలోని ఓ వ్యాపారి నుంచి 10 లక్షల రూపాయలు తీసుకుని షా ఇనాయత్​గంజ్​స్టేషన్​పరిధిలో ఉంటున్న మరో వ్యక్తికి డెలివరీ ఇవ్వటానికి ఇద్దరూ కలిసి బైక్‌పై బయల్దేరారు. కాగా, ఎన్నికల విధుల్లో భాగంగా గోషామహల్​స్టేడియం వద్ద తనిఖీలు చేస్తున్న సెంట్రల్​జోన్​టాస్క్​ఫోర్స్​సీఐ రాజూ నాయక్, ఎస్సైలు సాయికిరణ్, నవీన్​కుమార్‌‌తో పాటు సిబ్బందితో కలిసి ఈ ఇద్దరిని పట్టుకున్నారు. వారి నుంచి నగదును స్వాధీనం చేసుకున్నారు. డబ్బుకు సంబంధించి నిందితులు ఎలాంటి ఆధారాలు చూపించక పోవటంతో వారిని క్షుణ్ణంగా విచారించారు. ఈ క్రమంలో దొరికింది హవాలా డబ్బు అని నిర్ధారణ అయ్యింది. దాంతో ఇద్దరు నిందితులపై కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తు నిమిత్తం షా ఇనాయత్​గంజ్​పోలీసులకు అప్పగించారు.



Next Story

Most Viewed