ముగ్గురు అక్కా చెల్లెల్లు సజీవ దహనం: జమ్మూ కశ్మీర్‌లో విషాదం

by Dishanational2 |
ముగ్గురు అక్కా చెల్లెల్లు సజీవ దహనం: జమ్మూ కశ్మీర్‌లో విషాదం
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం జరగడంతో ముగ్గురు అక్కా చెల్లెల్లు సజీవదహనమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రాంబన్ జిల్లాలోని తన్మస్తా తజ్నిహాల్ గ్రామంలోని ఓ ఇంటిలో సోమవారం తెల్లవారుజామున అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు వేగంగా వ్యాపించడంతో అదే సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న ముగ్గురు బాలికలు బిస్మా(18), సానియా(11), సైక(14)లు సజీవదహనమయ్యారు. అయితే నిద్రలో ఉన్నందువల్ల వారు బయటకు రాలేక పోయారని, దీంతో ఇంట్లోనే చిక్కుకుని మరణించారని అధికారులు తెలిపారు. విషయం తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మృతదేహాలను బయటకు తీశారు. డెడ్ బాడీస్ పూర్తిగా కాలిపోయినట్టు తెలిపారు. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలను వెల్లడించలేదు.

Next Story