జగిత్యాల డ్రగ్స్ కేసు: బాలికకు గంజాయి ఇచ్చి ఏడాది పాటు అత్యాచారం

by Disha Web Desk 2 |
జగిత్యాల డ్రగ్స్ కేసు: బాలికకు గంజాయి ఇచ్చి ఏడాది పాటు అత్యాచారం
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కలకలం రేపిన జగిత్యాల గంజాయి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 10వ తరగతి విద్యార్థినులు గంజాయికి బానిసవ్వడం చూసి నివ్వెరపోయిన పోలీసులు.. వెంటనే విచారణ చేపట్టి, నిందితులను పట్టుకున్నారు. ఐదుగురు సభ్యులతో కూడిన ముఠాని అరెస్టు చేశారు. వీళ్లంతా చదువు మానేసి గంజాయి విక్రయిస్తున్నారని తెలిసింది. ఇందులో ఒక బాలికకు గంజాయి ఇచ్చి ఏడాది కాలంగా అత్యాచారం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితులు ప్రేమ్, వెంకటేశ్, నితిన్‌గా గుర్తించారు. ఈ ముగ్గురిపై పోక్సో, NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు తతంగం వెలుగులోకి వచ్చింది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed