- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గణేష్ నిమజ్జనంలో అపశృతి.. ఒకరు మృతి
by Batti.Sumithra |
మేడ్చల్ మండలం పరిధిలో గణేష్ నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది.

X
దిశ, మేడ్చల్ టౌన్ : మేడ్చల్ మండలం పరిధిలో గణేష్ నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు ప్రకారం మేడ్చల్ మండలంలోని రాజబొల్లారం తాండ గ్రామా మాజీ సర్పంచ్ మంగ్య నాయక్ తన ఇంట్లో గణేష్ విగ్రహానికి ఏర్పాటు చేశాడు. శనివారం అర్ధరాత్రి అదే గ్రామంలోని చెరువులో గణేశుని నిమజ్జనాన్ని చేస్తున్న సమయంలో గ్రామానికి చెందిన కే.సురేందర్ (28) ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మేడ్చల్ పోలీసులు తెలిపారు.
Next Story






