MS ధోని వీరాభిమాని ఆత్మహత్యకు కారణం అదేనా?

by Disha Web Desk 2 |
MS ధోని వీరాభిమాని ఆత్మహత్యకు కారణం అదేనా?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలో ఏ క్రికెటర్‌కు లేని ఫ్యాన్ ఫాలోయింగ్ టీమిండియా మాజీ సారథి ఎమ్ఎస్ ధోనికి ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దిగ్గజ క్రీడాకారులే స్వయంగా ఆయన్ను ఆరాధిస్తుంటారు. టీమిండియాకు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించడంతో పాటు రెండు ప్రపంచ కప్‌లు సాధించారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఆయన అభిమాని బలవన్మరణానికి పాల్పడటం కలకలం రేపుతోంది. తమిళనాడులోని కడలూర్‌ జిల్లా అరంగూర్‌కు చెందిన గోపికృష్ణన్(34) గురువారం తెల్లవారుజామున ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు రోజు రాత్రి డబ్బుల విషయంలో అదే ప్రాంతానికి చెందిన కొందరు గోపికృష్ణన్‌పై దాడి చేసినట్లు సమాచారం. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన అందరూ పడుకున్నాక సూసైడ్ చేసుకున్నాడు. ప్రస్తుతం కేసు దర్యా్ప్తులో ఉంది. కాగా, గతంలో చెన్నై సూపర్ కింగ్స్‌ను తలపించేలా పసుపు రంగుతో తన ఇంటిని మార్చేసి గోపికృష్ణన్ ఫేమస్ అయిన సంగతి తెలిసిందే.

Next Story

Most Viewed