పెళ్లి బస్సులో చెలరేగిన మంటలు.. ఐదుగురు సజీవదహనం

by Disha Web Desk 2 |
పెళ్లి బస్సులో చెలరేగిన మంటలు.. ఐదుగురు సజీవదహనం
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం ఘాజీపూర్‌లో విద్యుత్ వైర్లు తగిలి పెళ్లి బస్సు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఐదుగురు మృతిచెందగా.. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 30 మంది బంధువులు ఉన్నట్లు సమాచారం. స్థానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story