నలుగురు కూలీలు మృతి: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం

by Dishanational2 |
నలుగురు కూలీలు మృతి: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం
X

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటకలోని బీదర్ జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు కూలీలు మరణించగా..మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిప వివరాల ప్రకారం..మహారాష్ట్రకు చెందిన కూలీలు ఓ కాంట్రాక్టు వర్కు పనుల నిమిత్తం హైదరాబాద్‌కు వస్తున్నారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న వాహనం బీదర్ జిల్లాలోని సేవానగర్ లమానీ తండా సమీపంలో ఓ లారీని ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న తొమ్మిది మందికి తీవ్ర గాయాలు కాగా.. వెంటనే బీదర్‌లోని ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి నలుగురు మరణించారు. మరికొందరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు బీదర్ జిల్లా ఎస్పీ చన్నబసవ తెలిపారు. మృతులను దస్తగీర్ దవల్సాబ్ (36), రసీదా షేక్ (41), వలి (31), అమమ్ షేక్ (51)గా పోలీసులు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు వెల్లడించారు.

Next Story

Most Viewed