కర్ణాటకలో బస్సు బోల్తా పడి నలుగురు మృతి..30 మందికి గాయాలు

by Dishanational2 |
కర్ణాటకలో బస్సు బోల్తా పడి నలుగురు మృతి..30 మందికి గాయాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటకలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు బోల్తా పడిన ఘటనలో నలుగురు మృతి చెందగా..30 మందికి పైగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఆదివారం తెల్లవారుజామున 36 మంది ప్రయాణికులతో కూడిన ఓ ప్రయివేటు బస్సు బెంగళూరు నుంచి గోకర్ణకు వెళ్తుండగా..హోలాలకెరె టౌన్ సమీపంలో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించగా, మరో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హెలాల కెరె ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. డ్రైవర్ బస్సును అతివేగంగా నడపడంతోనే నియంత్రణ కొల్పోయి బోల్తా పడినట్టు వెల్లడించారు. మృతుల్లో ఇద్దరిని జగదీష్ (45), గణపతి (40)గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.

Next Story

Most Viewed