ఘోర ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్

by Disha Web Desk 2 |
ఘోర ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్
X

దిశ, వెబ్‌డెస్క్: నారాయణపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన డీసీఎం వాహనం లారీని ఢీకొనడంతో డీసీఎం వాహనంలో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటన మక్తల్ మండలం బొందలకుంటలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతులు కర్ణాటకలోని చిక్‌మంగళూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

Next Story

Most Viewed