BREAKING: జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం.. కెనాల్‌లోకి దూసుకెళ్లిన ట్రాక్టర్, ఇద్దరు దుర్మరణం

by Disha Web Desk 1 |
BREAKING: జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం.. కెనాల్‌లోకి దూసుకెళ్లిన ట్రాక్టర్, ఇద్దరు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: ట్రాక్టర్ బోల్తాపడి ఇద్దరు దుర్మరణం పాలైన ఘటన జిగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల పరిధిలో ఇవాళ సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ముత్యంపేట శివారులోని మామిడి తోటలోకి ట్రాక్టర్‌లో మొరం తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉన్నట్టుండి ట్రాక్టర్‌ పక్కనే ఉన్న కెనాల్‌లోకి దూసుకెళ్లింది. అయితే, ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌పై ఉన్న రాజేష్, షేక్ హైమద్ స్పాట్‌లో ప్రాణాలు విడిచారు. గమనించిన స్థానికులు కెనాల్‌లో పడిన ట్రాక్టర్‌ను జేసీబీ సాయంతో వెలికి‌ తీశారు. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed