BREAKING: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో దారుణం.. పట్టపగలే గొంతు కోసి వివాహిత దారుణ హత్య

by Disha Web Desk 1 |
BREAKING: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో దారుణం.. పట్టపగలే గొంతు కోసి వివాహిత దారుణ హత్య
X

దిశ, వెబ్‌డెస్క్: పట్టపగలే వివాహిత దారుణ హత్యకు గురైన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆర్మూర్ పట్టణంలోని సంతోష్ నగర్‌లో ఓ వివాహితను గుర్తు తెలియని దుండగులు అతి దారుణంగా గొంతు కోసి హతమార్చారు. అనంతరం నిందితులు అక్కడి నుంచి ఉడాయించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు హత్య జరిగిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆధారాలను సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. పాత కక్షల నేపథ్యంలో వివాహితను హత్య చేశారా.. లేక మరే ఇతర కారణం చేతైనా ఈ దారుణానికి ఒడిగట్టారా అన్న కోణంలో పోలీసులు ప్రాథమికంగా విచారణ చేస్తున్నారు. అయితే, హత్యకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed