ప్రాణం తీసిన పతంగి.. పండుగపూట ఆ ఇంట్లో తీవ్ర విషాదం

by Disha Web Desk 2 |
ప్రాణం తీసిన పతంగి.. పండుగపూట ఆ ఇంట్లో తీవ్ర విషాదం
X

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ పరిధిలోని అత్తాపూర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌తో 11 ఏళ్ల బాలుడు తనిష్క్ మృతిచెందాడు. సంక్రాంతి సెలవులు కావడంతో పండుగ వేళ పతంగి ఎగురవేసేందుకు ఇంటిపైకి వెళ్లాడు. ఈ క్రమంలో పతంగి విద్యుత్ వైర్లకు తగిలి కరెంట్ షాక్‌తో బాలుడు అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు. పతంగి ఎగురవేసేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని స్థానిక పిల్లలకు సూచించారు. సెలవుల్లో పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని తల్లిదండ్రులను హెచ్చరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed