ఢిల్లీలో దారుణం: మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్

by Dishanational2 |
ఢిల్లీలో దారుణం: మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మైనర్ బాలికపై ఓ వ్యక్తి, ముగ్గురు మైనర్ బాలురు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. జనవరి 1న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఢిల్లీలోని సదన్ బజార్‌లో ఉన్న ఓ టీ స్టాల్ యజమాని నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడానికి మహిళను సెట్ చేయాలని ఆ ప్రాంతంలో చెత్త ఏరుకునే ఓ మహిళను కోరాడు. దీంతో ఆ మహిళ కొంత డబ్బు తీసుకుని.. మరుసటి రోజు బాలిక(12)ను ఖుర్షీద్ మార్కెట్‌లోని భవనం పైకప్పు నుంచి చెత్త సేకరించాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే బాలిక అక్కడికి వెళ్లింది. అప్పటికే ఆమె రాక కోసం వేచి ఉన్న టీ స్టాల్ ఓనర్, అందులో పనిచేసే ముగ్గురు మైనర్ బాలురు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం జరిగిన విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. తిరిగి ఇంటికి వచ్చిన బాలిక రెండు రోజులుగా మౌనంగా ఉంది. దీంతో తమ బంధువులు, తల్లి దండ్రులు ఆరాతీయగా విషయం బయటపడింది. వెంటనే బాలిక పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులందరినీ అరెస్టు చేశారు. టీ షాపు యజమాని ఛత్తీస్‌గఢ్ నివాసి కాగా, అందులో పనిచేసే ముగ్గురు అబ్బాయిలు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌కు చెందినవారని వెల్లడించారు.



Next Story

Most Viewed