వినాయక నిమజ్జనంలో అపశృతి.. యువకుడిని బలితీసుకున్న చెరువు

by Bhoopathi Nagaiah |

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం చెప్యాల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.

వినాయక నిమజ్జనంలో అపశృతి.. యువకుడిని బలితీసుకున్న చెరువు
X

దిశ, మిరుదొడ్డి: సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం చెప్యాల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కంది శ్రీకాంత్ (30) వినాయక నిమజ్జనం చేస్తుండగా ప్రమాదవశాత్తు చెరువులో పడి మునిగిపోయాడు. సమాచారం అందుకున్న మిరుదొడ్డి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని వెలికి తీశారు. పండుగ రోజు జరిగిన సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్నట్లు మిరుదొడ్డి ఏఎస్ఐ మధు తెలిపారు. మృతునికి భార్య, 8 నెలల బాబు ఉన్నాడు.

Next Story