- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తీవ్ర వరద ఉధృతి.. కొట్టుకుపోయి వ్యక్తి మృతి
by Chintha Aamani |
న్యాల్కల్ మండలంలోని సవట వాగు వరద ఉధృతిలో చిక్కుకొని

X
దిశ,జహీరాబాద్ : న్యాల్కల్ మండలంలోని సవట వాగు వరద ఉధృతిలో చిక్కుకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. న్యాల్ కల్ మండలంలోని అమీరాబాద్ గ్రామానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి రవీందర్ (35) అనే వ్యక్తి ఈ సంఘటనలో దుర్మరణం పాలయ్యాడు. చాల్కి- చీకూర్తి గ్రామాల రోడ్డు మధ్యలో ప్రవహించే సవట వాగు పై ఉన్న చిన్నపాటి లోతట్టు వంతెనపై వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ వరదను గుర్తించక దాటేందుకు సాహసించడంతో ద్విచక్ర వాహనం తో సహా నీటిలో కొట్టుకుపోయి మృతి చెందాడు. ఈ సంఘటన అమీరాబాద్ లో విషాద ఛాయలు నింపింది. రుక్మాపూర్ తండాలో గల ఓ సోలార్ ప్లాంట్ లో వాచ్ మెన్ విధులు నిర్వహించే మృతుడికి భార్య లక్ష్మి , 4 సంవత్సరాల వయస్సు గల కుమారుడు, 2సంవత్సరాల వయస్సు గల కూతురు ఉన్నారు.
Next Story






