దారుణం.. కన్న కొడుకును కిరాతకంగా నరికి చంపిన తండ్రి

by Disha Web Desk 2 |
దారుణం.. కన్న కొడుకును కిరాతకంగా నరికి చంపిన తండ్రి
X

దిశ, గంభీరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సముద్ర లింగాపూర్ గ్రామంలో వేధింపులు భరించలేక కన్న కొడుకును తండ్రి గొడ్డలితో నరికి చంపాడు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన కుంట రమేష్ (42) అనే వ్యక్తి గత కొంతకాలంగా తండ్రి సాయిలు, తల్లి మల్లవ్వను వేధిస్తున్నాడు. ఇదే క్రమంలో శనివారం ఉదయం కూడా తల్లిదండ్రులను వేధించడం మొదలు పెట్టగా తండ్రి తీవ్ర కోపానికి వచ్చి గొడ్డలితో ఉదయం ఏడు గంటలకు తలపై నరకడంతో కొడుకు రమేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తండ్రిని అదుపులోకి తీసుకున్నారు.



Next Story

Most Viewed