వెల్లివిరిసిన మత సామరస్యం.. ప్రాణ ప్రతిష్ట రోజున పుట్టిన శిశువుకు రాముడి పేరు పెట్టిన ముస్లిం దంపతులు.. ఎక్కడంటే?

by Disha Web Desk 1 |
వెల్లివిరిసిన మత సామరస్యం.. ప్రాణ ప్రతిష్ట రోజున పుట్టిన శిశువుకు రాముడి పేరు పెట్టిన ముస్లిం దంపతులు.. ఎక్కడంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: 500 ఏళ్ల నాటి హిందువుల చిరకాల స్వప్నం అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం వైభవోపేతంగా ముగిసింది. రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా వేద మంత్రాల నడుమ, శ్రీరామ నామ పరాయణంతో అద్యంతం ఉత్సాహంగా కొనసాగింది. దేశంలోని ప్రజలు కుల, మత విబేధాలు లేకుండా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని వీక్షించి బాల రాముడి కృపకు పాత్రులయ్యారు. అదేవిధంగా ప్రసవానికి సిద్ధంగా ఉన్న గర్భిణులు జనవరి 22నే ప్రసవం చేయించుకునేందుకు ఆసుపత్రుల్లో చేరారు.

ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఫిరోజాబాద్‌కు చెందిన మస్లిం కుటుంబం మతసామరస్యాన్ని చాటి అందరికీ ఆదర్శంగా నిలిచారు. సరిగ్గా రామ్‌ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన జరుగుతుండగా ఫర్జానా అనే మహిళ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో పిల్లాడి బామ్మ హుస్నా తన మనవడికి హిందూ, ముస్లిం ఐక్యతను సూచించేలా ‘రామ్ రహీమ్’ అని పేరు పెట్టింది. అదేవిధంగా జనవరి 22న ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా మంచి రోజు కావడంతో ఒకే రోజున వేలల్లో ప్రసవాలు జరిగనట్లుగా తెలుస్తోంది.

Next Story

Most Viewed