రాంచరణ్ దంపతులకు అందిన ఆహ్వానం.. అక్కడికి వెళ్లేందుకు ఎదురుచూపులు!

by Disha Web Desk 1 |
రాంచరణ్ దంపతులకు అందిన ఆహ్వానం.. అక్కడికి వెళ్లేందుకు ఎదురుచూపులు!
X

దిశ, వెబ్‌డెస్క్ : మెగా పవర్ స్టార్ రాంచరణ్ దంపతులకు అపూర్వ గౌరవం దక్కింది. ఈ నెల 22న అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్టకు హాజరు కావాలని మెగా హీరో దంపతులకు నిర్వాహకుల నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. ఏళ్లుగా ఎదురుచూస్తున్న దివ్య మనోహర క్రతువును ప్రత్యక్షంగా తిలకించేందుకు పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరుకాబోతున్నారు. ఈ క్రంమలోనే రాంచరణ్‌-ఉపాసన దంపతును రామ మందిర ట్రస్టు ప్రతినిధులు ఆహ్వానించారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన అభిమానులు పంచుకుంటున్నారు. ఇప్పటి వరకు చిరంజీవి, ప్రభాస్‌, అమితాబ్ బచ్చన్‌, రణ్‌బీర్‌ కపూర్‌ దంపతులు, రాజ్‌కుమార్‌ హిరాణీ, రోహిత్‌ శెట్టి, ధనుష్‌ తదితరులు రామ మందిర ప్రారంభోత్సవానికి ప్రత్యేక ఆహ్వానాలు అందుకున్నారు.

Next Story

Most Viewed